telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఫణి తుఫాను కారణంగా  పలు రైళ్ల రద్దు

Attack Railway TTI in Danapur express
ఫణి తుఫాను కారణంగా వివిధ మార్గాల్లో నడిచే  పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. భువనేశ్వర్‌ నుం చి సికింద్రాబాద్‌ వరకు నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17015)ను, మంగళూరు-సంత్రగచి ఎక్స్‌ప్రెస్‌ (22852)ను ఈనెల 4న, దిబ్రుగర్‌-తాంబారం ఎక్స్‌ప్రెస్‌ (15930)ను ఈనెల 5న, ముజాఫర్‌పూర్‌-యశ్వంతాపూర్‌ ఎక్స్‌ప్రె్‌స(15228)ను ఈనెల 6న రద్దు చేసినట్లు సీపీఆర్‌ఓ రాకేష్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారుతెలిపారు. 
అదేవిధంగా డబ్లింగ్‌ పనులతో  గుంతకల్లు-గులపాలయాము సెక్షన్ల మధ్య జరుగుతున్న డబుల్‌ లైన్‌ నిర్మాణం కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు సీపీఆర్‌ఓ తెలిపారు. మిర్జాపల్లి-కాచిగూడ ప్యాసింజర్‌(57486)ను 9వరకు, మహబూబ్‌నగర్‌-మిర్జాపల్లి ప్యాసింజర్‌(57448)ను ఈనెల 9వ తేదీ వరకు కాచిగూడ-మిర్జాపల్లి స్టేషన్ల మధ్య తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. 

Related posts