ఫణి తుఫాను కారణంగా వివిధ మార్గాల్లో నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. భువనేశ్వర్ నుం చి సికింద్రాబాద్ వరకు నడిచే విశాఖ ఎక్స్ప్రెస్ (17015)ను, మంగళూరు-సంత్రగచి ఎక్స్ప్రెస్ (22852)ను ఈనెల 4న, దిబ్రుగర్-తాంబారం ఎక్స్ప్రెస్ (15930)ను ఈనెల 5న, ముజాఫర్పూర్-యశ్వంతాపూర్ ఎక్స్ప్రె్స(15228)ను ఈనెల 6న రద్దు చేసినట్లు సీపీఆర్ఓ రాకేష్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారుతెలిపారు.
అదేవిధంగా డబ్లింగ్ పనులతో గుంతకల్లు-గులపాలయాము సెక్షన్ల మధ్య జరుగుతున్న డబుల్ లైన్ నిర్మాణం కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు సీపీఆర్ఓ తెలిపారు. మిర్జాపల్లి-కాచిగూడ ప్యాసింజర్(57486)ను 9వరకు, మహబూబ్నగర్-మిర్జాపల్లి ప్యాసింజర్(57448)ను ఈనెల 9వ తేదీ వరకు కాచిగూడ-మిర్జాపల్లి స్టేషన్ల మధ్య తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు.