తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో ఆలయ ప్రాంగణంలో రథం దగ్ధమైన ఘటన ఏపీ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రథం దగ్దం కావడంపై ఏపీ బీజేపీ నిరసన నిరసన వ్యక్తం చేసిన సంగతి విధితమే. ఈ క్రమంలో బీజేపీ నేతలను గృహ నిర్బంధంలో ఉంచినట్టు తెలుస్తోంది. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ట్విట్టర్ లో స్పందించారు.
అంతర్వేది నరసింహస్వామి రథం దగ్ధం ఘటనపై ఆందోళనకు పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారిని గృహనిర్బంధం చేసి, బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. అంతర్వేది ఘటనలో దోషులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుజనా డిమాండ్ చేశారు.