telugu navyamedia
రాజకీయ వార్తలు

నిధులను కేంద్రానికి తిప్పి పంపలేదు: ఫడ్నవీస్

Fadnavis cm maharashtra

శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వస్తే రూ. 40 వేల కోట్ల నిధులను దుర్వినియోగం చేస్తారనే ఆలోచనతో వాటిని కేంద్రానికి తిప్పి పంపారంటూ బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దీంతో మహారాష్ట్రకు ఫడ్నవీస్ అన్యాయం చేశారంటూ శివసేన, ఎన్సీపీ మండిపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో, ఈ అంశంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ స్పందించారు. తన మూడు రోజుల పాలనలో ఎలాంటి నిధులను కేంద్రానికి తిప్పి పంపలేదని అన్నారు. ఇదంతా పూర్తి అసత్య ఆరోపణ అని ఫడ్నవీస్ అన్నారు.బుల్లెట్ రైలు విషయంలో భూసేకరణ చేయడం మినహా మహారాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో మరేమీ లేదని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం నిధులను కేంద్ర ప్రభుత్వం అడగలేదని చెప్పారు.

Related posts