telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదు: సీఎం జగన్

cm jagan on govt school standardization

అయోధ్య వివాదాస్పద స్థలం తుదితీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ స్పందించారు. ‘అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసిన మీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది’ అని అన్నారు.

‘ఇటువంటి పరిస్థితుల్లో మతసామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తిచేస్తున్నాను. ప్రజలందరుకూడా సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించమని విజ్ఞప్తిచేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

t

Related posts