telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : ముంబై ముందు భారీ లక్ష్యం…

నేడు ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ కు రుతురాజ్ గైక్వాడ్(4) త్వరగా ఔట్ కావడంతో షాక్ తగిలింది. కానీ ఆ తర్వాత కు108 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పిన ఫాఫ్ డు ప్లెసిస్(50), మొయిన్ అలీ(58) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. మళ్ళీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రైనా(2) ఔట్ అయిన అంబటి రాయుడు మాత్రం చెలరేగిపోయాడు. చివరి వరకు పరుగుల వరద పారించిన అంబటి 27 బంతుల్లో 72 పరుగులు చేసి అదరగొట్టడంతో చెన్నై నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది చెన్నై. ఇక ముంబై బౌలర్లలో పొలార్డ్ రెండు వికెట్లు తీయగా బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ఒక్కో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే ముంబై 219 పరుగులు చేయాలి. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

Related posts