telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

గుడ్‌న్యూస్.. కోవిషీల్డ్ టీకా ధరల తగ్గింపు.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఊరట

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తాము సరఫరా చేస్తున్న టీకా ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది సీరం ఇన్‌స్టిట్యూట్‌. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసును రూ. 400 లకు విక్రయిస్తున్న ఈ సంస్థ.. ఆ ధరను రూ. 300లకు తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్ పునావాలా ట్వీట్ చేశారు. తగ్గించిన ఈ ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రాలకు రూ. వేల కోట్ల నిధులు ఆదా కావడంతో పాటు ఎక్కువ మంది వ్యాక్సిన్ వేయించుకొనేలా ఉపయోగపడుతుందన్నారు.

Related posts