యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై ధర్మోజీగూడెం వద్ద ఓ బైక్ను లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
మృతుల్లో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లికి చెందిన హరీశ్ ఉన్నారు. మిగిలిన ఇద్దరు హైదరాబాద్లోని రామంతపూర్కు చెందినవారు. వీరంతా హైదరాబాద్లో ఏసీ మెకానిక్లుగా పనిచేస్తున్నారు.
కాగా, శుక్రవారం హరీశ్ స్వగ్రామంలో జరిగిన ఓ వివాహానికి ముగ్గురు హాజరయ్యారు. అనంతరం అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంత్రంలో హైదరాబాద్కు తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో ధర్మోజీగూడెంలో ఉన్న వేబ్రిడ్జి వద్ద ఓ లారీ రివర్స్ చేస్తుండగా వీరి బైక్ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
కులాల మధ్య చిచ్చు పెట్టి పైశాచిక ఆనందం: సుజనా చౌదరి ఫైర్