సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కలిగిన వారి నుంచి ఆన్లైన్ లావాదేవీలకు నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్) చార్జీలను వసూలు చేయవద్దని బ్యాంకులను ఆదేశించింది. 2020 జనవరి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది.రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలోనే నెఫ్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) ట్రాన్సాక్షన్లపై చార్జీలు తొలగిస్తామని ప్రకటించింది.
తాజా నిర్ణయంతో ఆన్లైన్లో చిన్న బిల్లులు చెల్లించడం, యూపీఐ లావాదేవీలు.. టోల్స్, పెట్రోల్ పంపుల్లో మొబైల్ వాలెట్ పేమెంట్స్, పార్కింగ్ బిల్లు చెల్లింపులపై నెఫ్ట్ చార్జీలు ఉండకపోవచ్చు.డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి తాము వసూలు చేసే ఆర్టీజీఎస్, నెఫ్ట్ ట్రాన్సాక్షన్లపై చార్జీలను తొలగించాలని నిర్ణయించామని తెలిపింది. దీంతో బ్యాంకులు కూడా ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయాలి. ఒక వారంలోగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయని ఆర్బీఐ పేర్కొంది.