telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు విద్యా వార్తలు సామాజిక

మధ్యాహ్న భోజనంలో పాము..

sanke in food

మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధం చేసిన భోజనంలో చనిపోయిన పాము కనిపించడం కలకలం రేపింది. పిల్లలకు వడ్డించే ముందే దీన్ని గుర్తించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. చిన్నారులంతా ఒకపూట ఆకలితో గడపాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే… నాందేడ్ జిల్లా గర్గావన్ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు ఉన్నాయి. మొత్తం 80 మంది విద్యార్ధులు ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు.

బుధవారం మధ్యాహ్నం విద్యార్ధుల కోసం వండిన ‘కిచిడీ’ని వడ్డించేందుకు సిబ్బంది సిద్దమయ్యారు. పాత్ర తెరవగానే అందులో చనిపోయిన నాగుపాము కనిపించడంతో షాక్ అయ్యారు. వెంటనే వడ్డించడం నిలిపివేసి అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా మధ్యాహ్న భోజనంలో పాము కనిపించిన మాట వాస్తవమేననీ, దీనిపై వెంటనే విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నాందేడ్ డీఈవో ప్రశాంత్ దిగ్రాస్కర్ పేర్కొన్నారు. విద్యార్ధులకు మధ్యాహ్న భోజనాన్ని సిద్ధంచేసే కాంట్రాక్టును పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ స్థానిక సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలకు అప్పగించిందని ఆయన తెలిపారు.

Related posts