అంధురాలైన 15ఏళ్ల బాలికపై ఇద్దరు అంధ ఉపాధ్యాయులు నాలుగు నెలల పాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన గుజరాత్లో జరిగింది. నిందితులు కూడా అంధులే కావడంతో ఈ ఘటన కలకలం రేపింది. దీపావళి పండుగ కోసం ఇంటికి వెళ్లిన బాలిక తిరిగి హాస్టల్కు వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఏం జరిగిందని నిలదీయగా తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని వివరించడంతో వెలుగులోకి వచ్చింది.
పటాన్ జిల్లాకు చెందిన ఓ అంధ బాలిక అంబాజీ పట్టణంలోని ఓ ట్రస్ట్ నిర్వహించే హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. నాలుగు నెలలుగా ఇద్దరు టీచర్లు ఆమెను బెదిరించి అత్యాచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని చెప్పడంతో బాలిక మౌనంగా ఉండిపోయింది. దీపావళి పండుగ కోసం ఇంటికి వెళ్లిన బాలిక తిరిగి హాస్టల్కు వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఏం జరిగిందని నిలదీయగా తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని వివరించి బోరుమంది.దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.