telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పాత స్నేహాలను పునరుద్ధరించుకుంటున్న.. బీజేపీ, ప్రధాని అభ్యర్థిని మార్చాలనే అందరి డిమాండ్…

లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బీజేపీకి మిత్రపక్షం శివసేన షాక్ ఇచ్చింది. బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా మోదీ ఉంటే మద్దతు ఇవ్వబోమని తేల్చిచెప్పింది. ఒకవేళ మోదీకి బదులుగా ఆరెస్సెస్ మూలాలు ఉన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే మద్దతు ఇస్తామని తెలిపింది. ఈ విషయమై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కేవలం తన గురించే ఆలోచిస్తుందని విమర్శించారు.

బీజేపీ పార్టీ నిర్లక్ష్యంతోనే తమదారి తాము చూసుకుంటున్నామని శివసేన వ్యాఖ్యానించింది. రాబోయే ఎన్నికలలో ఏ పక్షానికి పూర్తి మెజారిటీ రాబోదనీ, హంగ్ ఏర్పడటం ఖాయమని జోస్యం చెప్పారు. ఇదిలా ఉంచితే, ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు, మోదీని మళ్లీ ప్రధానిని చేసేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని నితిన్ గడ్కరీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Related posts