telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దిశ ఘటన… అల్లు అర్జున్ పై దారుణంగా ట్రోలింగ్

AY

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘అల వైకుంఠపురములో…’ వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్‌లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇటీవలే విడుదల చేసిన ‘సామజవరగమన’, ‘రాములో రాముల’, ‘ఓ డాడీ’ పాటలు చిత్రంపై అంచనాల్ని తారాస్థాయికి చేర్చాయి. ఈ పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. మొదటి పాట ‘సామజవరగమన’ కు ఇప్పటివరకు యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. సౌత్ ఇండియా సినిమా చరిత్రలో ఒక పాటకు 100 మిలియన్ వ్యూస్ రావడం ఇదే ప్రథమం. ఈ విషయాన్ని అల్లు అర్జున్ ట్వీట్ ద్వారా తెలిపారు. అయితే ఒక్కసారిగా నెటిజన్లు అల్లు అర్జున్ పై విరుచుకుపడ్డారు.

ఎందుకంటే… వారం రోజులుగా దేశం అంతా దిశాకు జరిగిన అన్యాయంపై గళం విప్పుతుంటే కొందరు స్టార్ సెలబ్రిటీలు మాత్రం అసలు ఏమాత్రం పట్టనట్టు మౌనంగా ఉన్నారు. వారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఆయన దిశా రేప్ ఘటనపై స్పందించకపోగా ఇలా ట్వీట్ చేయడంపై మండిపడుతున్నారు. ఎక్కడో కేరళ, తమిళనాడులో వరదలు వస్తే వెంటనే ఆర్థిక సాయం చేసి ఆదుకున్న అల్లు అర్జున్..తెలంగాణలో ఓ ఆడబిడ్డకు అన్యాయం జరిగితే మాత్రం స్పందించరు అంటూ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. అయితే దిశ ఘటనపై తెలుగు రాష్ట్రాలు అట్టుడుకుతున్న సమయంలో నా సినిమాలోని పాటకు 100 మిలియన్ వ్యూస్ వచ్చాయని గొప్పగా ట్వీట్ చేయడం చర్చనీయాంశం అయింది. దాంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితేంటి? నువ్వు మాట్లాడుతున్నదేంటి? అంటూ కొందరు నెటిజన్లు బన్నీపై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.

Related posts