ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బీజేపీ పార్టీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ప్రశాంతంగా ఉంటే.. ప్రతిపక్షాల్లో సొంతపార్టీ నేతల విమర్శలతో గందరగోళం ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రకటించిన టికెట్లలో 50 శాతంకి పైగా డిగ్రీ పూర్తి చేసిన వారు ఉన్నారని.. ప్రతిపక్షాల మాటలు ప్రజలకు కామెడీ షో లా అనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ లో రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట గెలువలేదని.. పక్క రాష్ట్రంలో దేనికి పనికి రాని వ్యక్తితో హైదరాబాద్ లో రాజకీయాలు ఎంటో వాళ్ళకే తెలియాలని కౌంటర్ వేశారు బాల్క సుమన్. అన్ని పథకాలు మావే అన్న కేంద్రం…30 ఏండ్ల లోపు కేంద్ర ఉద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని సూచించారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. ఆ హోదా లో హుందా గా ఉండాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్తర్ ప్రదేశ్- గుజరాత్ లో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని.. ప్రతిపక్షాలు టీఆర్ఎస్ నేతలపై వ్యక్తిగత విమర్శలు మానుకొని దమ్ముంటే అభివృద్ధిపై మాట్లాడాలని పేర్కొన్నారు.
previous post