బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్” తెలుగులో విజయవంతంగా రెండు సీజన్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రియాలిటీ షోకు సంబంధిచిన మరో సీజన్ జూలై నుండి ప్రారంభం కానుంది. ఈ సీజన్కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తాడని ప్రచారం జరగుతుంది. ఇక కంటెస్టెంట్స్గా రేణూ దేశాయ్, సావిత్రి, ఉదయ భాను , కేఏ పాల్ వంటి సెలబ్రిటీలు ఉంటారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేణూ దేశాయ్ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను బిగ్ బాస్లో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. బిగ్ బాస్ షో విషయంలో తనకు చాలా మంది నుంచి సందేశాలు, ఫోన్లు వచ్చాయి. వారందరికీ నేను ఒకటే చెబుతున్నాను. బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేయడం లేదు. అదంతా తప్పుడు ప్రచారమే. అయితే బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తే తన లో నైపుణ్యం మరింత పెరుగుతుందని, అందుకే ఛాన్స్ వస్తే బిగ్ బాస్ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తానని పేర్కొంది రేణూ. తెలుగులో ఓ టీవీ షోకి రేణూ జడ్జిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇటీవల తన రెండో పెళ్ళికి సంబంధించి వార్తలలో నిలిచిన రేణూ ప్రస్తుతం తన తర్వాతి సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్తో బిజీగా ఉంది.
previous post