తనకు మద్యం అలవాటు లేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఇటీవలే బోనాల వేడుక సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉత్సాహంతో డ్యాన్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, తాను మద్యం మత్తులో డ్యాన్స్ చేశానంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ తలసాని మండిపడ్డారు. తనకు మద్యం అలవాటు లేదని, ప్రతి ఏడాది బోనాలకు డ్యాన్స్ చేస్తానని స్పష్టం చేశారు.
ఆడియోను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై తాను సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని తెలిపారు. తలసాని తప్పెట వాయిద్యాలకు అనుగుణంగా డ్యాన్స్ చేయగా, మందుబాబులం మేము మందుబాబులం అనే పాటకు డ్యాన్స్ చేసినట్టుగా ఓ టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.
టీడీపీ వాళ్లు పిటిషన్లు వేసినా భయపడవద్దు: స్పీకర్ తమ్మినేని