తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో వెట్ రన్ ఈరోజు విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు హరీశ్ రావు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు హరీశ్ రావు ట్విట్టర్ లో స్పందించారు.ప్రాజెక్ట్ ప్యాకేజీ 6లోని మోటార్ పంపును ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ప్రారంభించారు. దీంతో నీళ్లు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ సాగునీటిశాఖ మంత్రి, టీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్పందించారు. ఈ ప్రాజెక్టు వెట్ రన్ విజయవంతం నిర్వహించిన ఇంజనీర్లకు ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు.