telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

పథకం ప్రకారమే నిందితుల ఎన్ కౌంటర్: మహిళా సంఘం నేత దేవి

devi leader women

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై మానవ హక్కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పథకం ప్రకారమే నిందితులను అంతమొందించారని మహిళా సంఘం నేత దేవి అన్నారు. కసబ్ వంటి కరుడుగట్టిన తీవ్రవాదిని కూడా ఎన్ కౌంటర్ చేయలేదని, చట్టప్రకారమే శిక్షించారని తెలిపారు. దేశంలో లక్షల కేసులు అపరిష్కృతంగా ఉండగా, ఆ నేరస్తులను ఎందుకు వదిలిపెడుతున్నారని ప్రశ్నించారు.

84 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం నేరారోపణలు ఎదుర్కొంటున్నారని, వారిని ఎందుకు ఎన్ కౌంటర్ చేయలేదని నిలదీశారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై హైకోర్టుకు ఫిర్యాదు చేస్తామని దేవి వెల్లడించారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకపు ఎన్ కౌంటర్ అని ఆరోపించారు.

Related posts