telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్‌ తమళిసై

governor tamilisai

74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ రాజ్‌భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భౌతిక దూరం పాటిస్తూ నిల్చున్న అధికారులు, ఇతర సిబ్బంది వద్దకు స్వయంగా గవర్నర్‌ వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

పోలీసు సిబ్బందికి స్వయంగా స్వీట్‌లు పంచారు. అంతకు ముందు గవర్నర్‌ దంపతులు, కుటుంబ సభ్యులు రాజ్‌భవన్‌లోని గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజ్‌భవన్‌లోని చారిత్రక దర్బార్‌హాల్‌ ముందు జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో గవర్నర్‌ సలహాదారులు రిటైర్డ్‌ ఎపివిఎస్‌శర్మ, ఎకె మహంతి, గవర్నర్‌ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Related posts