telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నితిన్ గడ్కరీకి లేఖ అందజేసిన కేశినేని నాని

kesinenii Nani Nithin gadkri

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు నాని లేఖను అందజేశారు. ఈ మేరకు నాని ట్వీట్ చేశారు. విజయవాడ పౌరుల చిరకాల స్వప్నం అయిన కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తయిన సందర్భంగా గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపినట్టు వెల్లడించారు.

విజయవాడ వచ్చి ఫ్లైఓవర్ ను ఆయన అమృతహస్తాలతో ప్రారంభించవలసిందిగా కోరినట్టు తెలిపారు. మీరు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు మీరు ప్రారంభిస్తేనే బాగుంటుందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక నగరానికి కనకదుర్గ ఫ్లైఓవర్ అందమైన మణిహారం వంటిదని నాని పేర్కొన్నారు.

Related posts