టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేశ్ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో విమర్శనాస్త్రాలు సంధించారు. మంగళగిరి ప్రజలు ఈడ్చికొట్టిన తర్వాత లోకేశ్ చిటికెడు మెదడు మరింత చిట్లినట్టుందని పేర్కొన్నారు.
లోకేశ్ స్థాయి మరచిపోయి చెలరేగిపోతున్నారని వ్యాఖ్యానించారు. చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని మీ తండ్రి తమపై కుట్ర చేశారని ఆరోపించారు. ఇప్పుడు అదే చిదంబరం, ఆయన కుమారుడు బెయిల్ పై బయట ఉన్నారని చెప్పారు. మీ దొంగల ముఠాకు మూడే రోజు దగ్గర్లోనే ఉందని ట్విట్టర్ లో పేర్కొన్నారు.