ఏపీసీఎం జగన్ ను కేసీఆర్ ఆహ్వానించేందుకు నేడు విజయవాడ రానున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. విమానంలో మధ్యాహ్నం 12:50 గంటలకు గన్నవరం చేరుకోనున్న కేసీఆర్ విజయవాడలోని గేట్వే హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు.
2:30 గంటలకు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి భేటీ అవుతారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తారు. అక్కడే భోజనం చేసి సాయంత్రం 5 గంటలకు గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్లి శారదాపీఠం ఉత్తరాధికారి దీక్షా స్వీకరణ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం రాత్రి హైదరాబాద్ చేరుకుంది.