టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఎంతమంది అభిమానులుంటారో.. ఆయన కూతురు జీవాకు కూడా అదే రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. అయితే.. ఈ మధ్య సన్ రైజర్స్ తో తలపడిన చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో ధోని సిక్స్ కొట్టి ఫినిష్ చేసిన సీన్ గుర్తుందా? ఆ షాట్ కి జీవా ఆశ్చర్యపోయి బాల్ వంక చూస్తూ ఉండిపోయింది. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కాగా.. మరో ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిన్న జరిగిన ఢిల్లీ వర్సెస్ చెన్నై మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే మ్యాచ్ రసవత్తరంగా ఉన్న సమయంలో ధోనీ కూతురు జీవా కళ్లు మూసుకొని దేవుడికి మొక్కుకుంటున్న ఫొటోలు ఇప్పుడు వైరల్గా మారాయి.
తన తండ్రి గెలవాలని జీవా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరో ఫొటో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ 2021లో జివా స్టేడియంకు వచ్చి సందడి చేసింది.గతంలో చెన్నై (Chennai Super Kings) ఆడిన మ్యాచ్ల సందర్భంగా వీఐపీ గ్యాలరీల్లో తల్లితో పాటు కూర్చున్నది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్తో సోమవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా మాత్రం సరికొత్త జీవా కనపడింది.
అయితే.. బ్యాడ్ లక్ ఈ మ్యాచ్ లో ధోనీ సేన ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై భారీ స్కోరు చేయలేకపోయింది. 20 ఓవర్లలో.. 5 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. కాగా.. లక్ష్య చేధనలో ఢిల్లీ కాస్త తడబడినా.. రెండు