తెలుగు తేజం పీవీ సింధు ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలుచుకున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ పోటీల్లో అనేక పతకాలు పొందిన ఆమె జీవితం ఆధారంగా బయోపిక్ ను తెరకెక్కించేందుకు సోనుసూద్ ముందుకు వచ్చారు. ఈ బయోపిక్ ను తాను నిర్మిస్తూనే, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్రలో కూడా నటించనున్నారు. అయితే పీవీ సింధు పాత్రలో ఎవరు నటిస్తారనే దానిపై కొద్ది రోజులుగా చర్చలు జరుగుతుండగా, అక్కినేని కోడలు సమంతని ఫైనల్ చేసారనే టాక్ నడుస్తుంది. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ గెలుచుకున్న తరువాత సింధు ఓ లీడింగ్ ఇంగ్లీష్ పేపర్ కి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “తన పాత్రలో ఖచ్చితంగా దీపికా పదుకొణే నటించాలని భావిస్తున్నాని తెలిపింది. ఆమె చురుకైన బ్యాడ్మింటన్ ప్లేయర్తో పాటు మంచి నటి. అందుకే నా పాత్రలో దీపికాని చూడాలని అనుకుంటున్నాను. ఇక తుది నిర్ణయం మేకర్స్దే అని సింధు పేర్కొంది. ఇచ్చింది. అందులో తనకు మహేష్ బాబు, ప్రభాస్ లతో పాటు హీరోయిన్ దీపికా పదుకోన్ అంటే చాలా ఇష్టమని వెల్లడించింది. దీపికా టాలెంట్ తో పాటు ఎంతో అందంగా ఉంటారని ఆమె గురించి గొప్పగా మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూ చదివిన దీపికా సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ ఇంటర్వ్యూ ఫోటోని షేర్ చేసి “లవ్ యూ ఛాంప్” అని పేర్కొన్నారు. ప్రస్తుతం దీపికా పదుకొణే, కపిల్ దేవ్ జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న “83” చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మరి మొత్తానికి ఈ చిత్రంలో సింధు పాత్రలో ఎవరు కన్పిస్తారో చూడాలి.
previous post
next post
నా తొడమీద పుట్టుమచ్చ చూసి చాలామంది పడిపోయారు… “నగ్నం” హీరోయిన్