కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలుగా చర్యలను చేపడుతున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా షూటింగ్లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. పలువురు సెలబ్రిటీలు ప్రభుత్వాలకు విరాళాలను అందించడమే కాకుండా నైతికంగా తమ మద్దతుని తెలియజేస్తున్నారు. అయితే ఈ నెల 17వ తేదీన నిర్వహించాల్సిన తన కుమారుడు, నటుడు నిఖిల్ వివాహం అదే సమయానికి జరుగుతుందని, కానీ మొదట చెప్పినట్లు అంగరంగ వైభవంగా కాదని మాజీ సీఎం. హెచ్.డి.కుమారస్వామి అన్నారు. మంగళవారం తమ కుమారుడు నిఖిల్ వివాహం విషయమై ఆయన మాట్లాడుతూ అనుకున్న ప్రకారం ఈ నెల 17వ తేదీన ఈ వివాహం జరుగుతుంది. వధూవరుల కుటుంబాల నుంచి కేవలం 15–20 మంది మాత్రం హాజరవుతారు. బెంగళూరులో మా ఇంటిలోనే పెళ్లి జరుగుతుంది అని తెలిపారు.
previous post