బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 ఆదివారం ఎపిసోడ్తో సక్సెస్ఫుల్గా 50 రోజులు (ఏడు వారాలు) పూర్తి చేసుకుంది. ఈ వారం శిల్ప చక్రవర్తి, పునర్నవి, మహేష్, హిమజ, శ్రీముఖి లలో ఒకరు ఇంటి నుండి వెళ్ళనున్నారు. భార్యభర్తలు వరుణ్ సందేశ్, వితికాలు కంటెస్టెంట్లుగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరు మొదట ఎంతో ఆప్యాయంగా ఉండగా, ఇటీవల కొన్ని టాస్క్లలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తుతున్న విషయం మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో వితికా వెక్కి వెక్కి ఏడవడం, వెంటనే ఆమె వెనుక వరుణ్ వెళ్లి ఓదార్చడం జరుగుతూ వస్తుంది. కట్ చేస్తే ఈ రోజు ప్రసారం కానున్న ఎపిసోడ్లో వితికా దెయ్యంగా మారి ఇంటి సభ్యులని బయపెట్టనుంది. అయితే టాస్క్లో భాగంగా ఒకానొక సందర్భంలో వరుణ్… దెయ్యమైన వితికా చేతిలో ప్రాణాలు కోల్పోతాడట. ఈ విషయాన్ని ప్రోమో ద్వారా తెలియజేశారు బిగ్ బాస్. దెయ్యాలున్నాయి జాగ్రత్త అనే టాస్క్లో భాగంగా ఇంటి సభ్యులలో కొందరు దెయ్యాలుగా మారనున్నారు. వారిలో వితికాతో పాటు బాబా భాస్కర్,హిమజ కూడా ఉంటారని ప్రోమోని బట్టి అర్ధమవుతుంది. అసలు ఈ రోజు బిగ్ బాస్ హౌజ్లో ఏం జరగనుందో తెలియాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.
Dayyalu unnayi jagratta!!#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/WThhAMtqag
— STAR MAA (@StarMaa) 10 September 2019