సూపర్స్టార్ మహేష్ హీరోగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్వైడ్గా విడుదలకానుంది. కాగా చిత్రయూనిట్ అభిమానుల కోసం దీవాళి సర్ప్రైజ్గా చిత్రం నుంచి రెండు లుక్స్ను విడుదల చేసింది. అందులో ఒకటి చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న లేడీ సూపర్స్టార్ విజయశాంతి లుక్ కాగా, రెండో లుక్ మహేష్ బైక్పై వస్తోన్న పవర్ ఫుల్ లుక్. మహేష్ బైక్పై వస్తున్న ఈ స్టయిలిష్ లుక్ బ్యాగ్రౌండ్లో రాజకీయాలకు సంబంధించిన కొన్ని పోస్టర్స్ దర్శనమిస్తున్నాయి. అలాగే ఒక పార్టీకి సంబంధించిన బహిరంగ సభ జరుగుతున్నట్లుగానూ, పోలీసులు పబ్లిక్ను కంట్రోల్ చేస్తున్నట్లుగా ఈ న్యూ పోస్టర్లో చూపించారు.
Happy Diwali 🙂 🙂 #SarileruNeekevvaru pic.twitter.com/z7QGAGEvGp
— Mahesh Babu (@urstrulyMahesh) 26 October 2019