telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“పైన పటారం..లోన లోటారం” అంటున్న జబర్దస్త్‌ యాంకర్‌

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో వ‌రస హిట్స్ కొడుతున్న ‌బన్నీ వాసు నిర్మాత‌గా ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శకుడు కౌశిక్ తీస్తున్న చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలో అనసూయ మాస్ మ‌సాలా ఐట‌మ్ సాంగ్ చేస్తుందనే విషయం తెలిసిందే.  తాజాగా మరో పాటను రిలీజ్‌కు సిద్దం చేశారు. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌గా రూపొందిన ‘పైన పటారం ఈడ లోన లొటారం‘ అంటూ సాగనున్న ఈ పాటలో బుల్లితెర బ్యూటీ అనసూయ ఆడి పాడనున్నారు. ఈరోజు ఈ పాట ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోను అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో అనసూయ తన డాన్స్‌తో అందరినీ కట్టిపడేస్తున్నారు. 

Related posts