telugu navyamedia
క్రైమ్ వార్తలు

గుంటూరు జిల్లాలో దారుణం..

తెనాలిలో దారుణం చోటు చేసుకుంది.ఓ మహిళ తన అత్తను దారుణంగా హత్య చేసింది. ఈ ఘ‌ట‌న‌ ఏపీలో గుంటూరు జిల్లా తెనాలిలో జ‌రిగింది. అత్త వేధింపులు తట్టుకోలేక ఓ కోడలు చపాతీ కర్రతో ఆమెను హతమార్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగానమ్మపేటలోని ప్యారడైస్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 306 లో నివాసముంటున్న కోడలు ప్రియాంకను అత్త మైథిలీ నిత్యం వేధింపులకు గురి చేసేది. అత్త వేధింపులు తట్టుకోలేకపోయిన కోడలు రాధా ప్రియాంక ఆమె పీడ వదిలించుకోవాలని నిర్ణయించుకుంది.

ఈ క్రమంలో అత్త నిద్రిస్తున్న సమయంలో ఆమెపై చపాతీ కర్రతో దాడి చేసింది. అంతేకాదు కూరగాయలు కోసే కత్తి తో అత్తపై దాడి చేసింది. చపాతీ కర్రతో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అత్త మైధిలి అక్కడికక్కడే మరణించింది.

మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణలో అత్త మైధిలి వేధింపులు తట్టుకోలేక కోడలు రాధా ప్రియాంక అత్తను హతమార్చినట్లుగా పోలీసులు నిర్ధారించారు. .కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని​ కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

 

Related posts