యువనటి ఈశ్వరి దేశ్పాండే రోడ్డుప్రమాదంలో మృతిచెందింది. పుణెకు చెందిన ఈమె.. మరాఠీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న 25 ఏళ్ల ఈశ్వరి దేశ్ పాండే తన బాయ్ఫ్రెండ్ శుభమ్ దెడ్జేతో కలిసి సెప్టెంబర్ 15న గోవా హాలిడే ట్రిప్ కు వెళ్లింది.
అక్కడ ఓ పార్టీకి వెళ్లి, తిరిగి వస్తుండగా.. బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు గోవాలోని కలన్గుటే వద్ద ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న కారు బాగా కాలువలో పడిపోయింది. ఆ సమయంలో కారు సెంట్రల్ లాక్ చేసి ఉండటంతో బయటకు రాలేక కారులోనే ఇరుక్కుపోయి ఈశ్వరి ఆమె బాయ్ఫ్రెండ్ శుభమ్ దెడ్గే అక్కడికక్కడే చనిపోయారు.
ఈశ్వరి, శుభమ్.. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. మరికొద్ది నెలల్లో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టాలనుకున్నారు. ఇంతలోనే కారు ప్రమాదంలో ఇద్దరు చనిపోవడం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. వీరి మరణంతో మరాఠీ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఆమె నటించిన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.