telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

దేశంలో కరోనా మహోగ్రరూపం..కొత్తగా 96,551 మందికి పాజిటివ్

Corona

దేశంలో క‌రోనా వైరస్ మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్ర‌తిరోజు రికార్డు స్థాయిలో కేసులు న‌మోదవుతు‌న్నాయి. మొత్తం కేసుల సంఖ్య 45 ల‌క్ష‌ల మార్కును దాటింది. గత 24 గంటల్లో దేశంలో 96,551 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 45,62,415కు చేరింది. గ‌త 24 గంట‌ల సమయంలో 1,209 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 76,271కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 35,42,664 మంది కోలుకున్నారు. 9,43,480 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. నిన్నటి వరకు మొత్తం 5,40,97,975 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.

Related posts