telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో 20 లక్షల మందికి కరోనా పరీక్షలు!

corona vaccine India

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,426 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,52,602కు పెరిగినట్టు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ద్వారా తెలుస్తోంది.రాష్ట్రంలో నిన్న 13 మంది కరోనా కారణంగా మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 940కి పెరిగింది. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది.

రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 2,324 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా కోరల నుంచి బయటపడిన వారి సంఖ్య 1,19,467కు చేరుకుంది. ఇంకా 32,195 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీరిలో 25,240 మంది ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 62,890 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 20,16,461 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు.

Related posts