telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

227 పరుగుల తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్…

south africa team changes on england series

భారత్-ఇంగ్లాండ్ జరుగుతున్న మొదటి టెస్ట్ లో ఇంగ్లాండ్ ఘానా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 578 పరుగులు చేసి ఆల్ ఔట్ కాగా భారత్ 337 పరుగులకే కుప్ప కూలిపోయింది. అయితే భారత కంటే ఇంకా 241 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ ఫాలోఆన్ ఎంచుకోకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం టీం ఇండియా బౌలింగ్‌లో అదరగొట్టింది. అశ్విన్‌ దెబ్బకు నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌటైంది. అలౌటైన ఇంగ్లండ్‌.. 420 పరుగుల భారీ లక్ష్యాన్ని టీం ఇండియా ముందు పెట్టింది. ఇక నిన్న ఆట ముగిసే సమయానికి 39/1 తో ఉన్న టీం ఇండియాకు చివరి రోజు మొదట్లోనే భారత్ కు షాక్ తగిలింది. కేవలం మొదటి సెషన్లోనే 5 వికెట్లు కొల్పోయిన భారత్ రెండో సెషన్ లో 192 పరుగులకే ఆల్ ఔట్ అయింది. దాంతో 227 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించి నాలుగు టెస్టుల ఈ సిరీస్ లో 0-1 తో ఆధిక్యంలోకి వెళ్ళింది. చూడాలి మరి రెండో టెస్టులో ఏం జరుగుతుంది అనేది.

Related posts