భారత్ మరికొన్నిగంటల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పనుంది. జనవరి 1న ఒకరికొకరు విషెస్ చెప్పుకోవడం సాధారణమైన విషయం. అయితే, హైదరాబాదులోని చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన పూజారి సౌందరరాజన్ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. తమ ఆలయ పరిసరాల్లో ఎవరైనా హ్యాపీ న్యూ ఇయర్ అని చెబితే వారితో గుంజీలు తీయిస్తామని హెచ్చరించారు.
జనవరి 1న నూతన సంవత్సరం జరుపుకోవడం మన సంస్కృతి కాదని, పాశ్చాత్యుల సంస్కృతిని మనం పాటించడం ఏంటని సౌందరరాజన్ ప్రశ్నించారు. తెలుగు ప్రజలకు ఉగాది నాడే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని, ఆ రోజునే వేడుకలు జరుపుకోవాలని అన్నారు.