telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

నియంత్ర‌ణ పాటించ‌ని వారిని క‌రోనా వ‌దిలిపెట్ట‌దు: ఇమ్రాన్‌

imran pakistan pm

నియంత్ర‌ణ పాటించ‌ని వారిని క‌రోనా మహమ్మారి వ‌దిలిపెట్ట‌ద‌ని పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్ హెచ్చ‌రించారు. కరోనాపై పోరాటంలో భాగంగా శనివారం లాహోర్‌లో కరోనా రిలీఫ్‌ ఫండ్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికా, చైనా లాంటి పెద్ద‌పెద్ద దేశాలనే క‌రోనా వైర‌స్ ఉక్కిరిబిక్కిరి చేసింద‌న్నారు.

ఈ వైర‌స్ రూపంలో ఇప్పుడు మ‌న దేశానికి ఒక పెద్ద స‌వాల్ ఎదురైంద‌ని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఈ స‌వాల్‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొని క‌రోనాపై విజ‌యం సాధిద్దామ‌ని పాకిస్థాన్ ప్ర‌జ‌ల‌కు ఇమ్రాన్‌ఖాన్‌ పిలుపునిచ్చారు. ఇంత‌టి క్లిష్ట స‌మ‌యంలో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించి చ‌రిత్ర‌లో మూర్ఖులుగా నిలిచిపోవ‌ద్ద‌ని ఆయ‌న కోరారు. పాకిస్థానీల‌కు రోగ‌నిరోధ‌క శ‌క్తి ఎక్కువని సోష‌ల్ మీడియాలో జ‌రిగే త‌ప్పుడు ప్ర‌చారాన్ని న‌మ్మి ప్ర‌జ‌లు నమ్మవద్దన్నారు.

Related posts