భారత్, పాకిస్థాన్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లను తిరిగి పునరుద్ధరించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ ఛైర్మన్ జాకా అష్రాఫ్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని కోరాడు. జిన్నా-గాంధీ పేరిట భారత్-పాక్ సిరీస్ను నిర్వహిస్తే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమవుతాయన్నాడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ జాకా అష్రాఫ్. అయితే భారత్-పాక్ మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాల కారణంగా భారత్-పాక్ మధ్య 2008 నుండి ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్ లు జరగం లేదు. ఇక ఈ రెండు దేశాలు చివరిసారిగా 2019 ప్రపంచకప్లో తలపడ్డాయి. ఇక భారత్-పాక్ సిరీస్ పై అష్రాఫ్ మాట్లాడుతూ… ‘నా పదవీకాలంలో జిన్నా-గాంధీ పేరుతో సిరీస్ను ప్రారంభించడానికి ప్రయత్నించాను. ఈ విషయాన్ని బీసీసీఐకి కూడా తెలిపాను. ఉగ్రవాద అంశాల కారణంగా భారత్ ఈ విషయంలో వెనక్కి తగ్గింది. జిన్నా-గాంధీ పేరుతో సిరీస్ ప్రారంభిస్తే.. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు బలోపేతమవుతాయి. ఇది మరో యాషెస్ సిరీస్లా మారుతుంది” అని అష్రాఫ్ పేర్కొన్నారు.
previous post