కరోనా బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది, ఇతర అధికారులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ తెలిపారు. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ కార్యక్రమం రూపొందించిందని ఆమె మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, ల్యాప్టా్పల ద్వారా అవసరమైన శిక్షణ మెటీరియల్ ఇస్తామన్నారు, ఈ ట్రైనింగ్ మోడ్యుల్స్ను https://igot.gov.in నుండి పొందవచ్చని తెలిపారు.