telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

విజయారెడ్డిని హత్య చేసిన సురేశ్ నాకు తెలియదు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే

kishan reddy trs mla

అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి నిన్న దారుణ హత్య కు గురైన సంగతి తెలిసిందే. సురేశ్ అనే వ్యక్తి ఆమెను తహశీల్దార్ కార్యాలయంలోనే పెట్రోల్ పోసి, నిప్పంటించి చంపేశాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకం సృష్టించింది. తహసీల్దార్ హత్యపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. హత్య వెనుక కుట్ర ఉందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో విజయారెడ్డి మాట్లాడినట్లు ఉన్న ఓ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ ఆడియోలో ఆమె కొందరు రాజకీయ నేతల పేర్లు చెప్పినట్టు తెలుస్తోంది. ఓ మంత్రి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేల పేర్లు ఇందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, సురేశ్ ఎవరో తనకు తెలియదని చెప్పారు. సమస్యలు ఉన్నాయంటూ ఎంతో మంది ప్రతిరోజు తనను కలుస్తుంటారని తెలిపారు. విజయారెడ్డి హత్య దురదృష్టకరమని అన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పారు.

Related posts