telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది: ఉత్తమ్

uttam congress mp

తెలంగాణలో బడుగు, బలహీన వర్గాలపై అనేక దాడులు జరిగాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూఅన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో సాగునీటి రంగంలో పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతున్నా పాలకులకు చీమ కొట్టినట్టు లేదని మండిపడ్డారు. తెలంగాణకు ఒక్క నీటి చుక్క అన్యాయం జరిగినా ఊరుకోమని హెచ్చరించారు.

ప్రజా అభిప్రాయం మేరకు యూపీఏ ప్రభుత్వం తెలంగాణను ఏర్పాటు చేసిందని అన్నారు. అయితే గత 6 ఏళ్లలో తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అమలు చేసే విషయంలో ముందుండి పని చేస్తుందని ఉత్తమ్ పేర్కొన్నారు.

Related posts