telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నిర్మల్‌లో రేపరెపలాడిన భారీ జాతీయ పతాకం!

Indian flag

74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్మల్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలో భారీ జాతీయ పతాకాన్ని ఏర్పాటుచేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్మల్‌పట్టణంలో 150 అడుగుల భారీ మవ్వన్నెల జెండాను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. మంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ధర్మసాగర్‌ మినీ టాంక్‌బండ్‌ వద్ద ఈ భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేశారు.

14వ ఆర్ధిక సంఘం నిధులతో రూ. 53లక్షలతో జాతీయ పతాకం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అతిఎత్తయిన జెండాల్లో ఇది ఒకటి. ఈభారీ జాతీయ జెండాను ముంబయ్‌కి చెందిన బజాజ్‌ కంపెనీ రూపొందించింది. 32 అడుగుల పొడవు, 48 అడుగుల వెడల్పుతో త్రివర్ణ పతాకాన్ని ముంబైలో తయారు చేయించారు.

Related posts