telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఏపీ ఫలితాలపై .. 300కోట్ల బెట్టింగులు.. ఏడుగురు అరెస్ట్ ..

SIT Investigation YS viveka Murder

ఫలితాలు వెలువడే సమయం సమీపిస్తున్న కొద్దీ .. ఏపీలో ఎన్నికల ప్రధాన పార్టీలతో పాటు ఆయా పార్టీల అధినేతలు, నాయకులు, అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. ముఖ్యంగా, బెట్టింగ్ రాయుళ్లు ఫలానా పార్టీ గెలుపు ఖాయమంటూ బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మంగళగిరిలో బెట్టింగ్ లు నిర్వహిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులను గుంటూరు అర్బన్ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.

పోలీసులు, నిందితుల నుంచి రూ.10.15 లక్షల నగదు, ఒక కారు, 7 సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ బెట్టింగ్ లలో మధ్యవర్తులే కీలకం. బెట్టింగ్ కాసే వారు మధ్యవర్తులకు 5 శాతం కమిషన్ కూడా ఇవ్వాలి. అదేవిధంగా, బాండ్ పేపర్లపై అగ్రిమెంట్ కూడా చేసుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, మంగళగిరిలో నారా లోకేశ్ గెలుస్తాడని రూ.300 కోట్ల మేరకు బెట్టింగ్ లు చేసినట్టు సమాచారం.

Related posts