telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

ఓటర్‌ లిస్టులో తప్పులకు ఎవరిపై చర్యలు తీసుకున్నారు: శశిధర్‌రెడ్డి

Congress Shashidar Reddy Comments EC
ఓటర్‌ లిస్టులో పొరపాట్లు జరిగాయని ఎన్నికల సంఘం చెప్పిందని, ఆ తప్పులకు ఎవరిపై చర్యలు తీసుకున్నారని కాంగ్రెస్‌ నేత మర్రిశశిధర్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘానికి సరైన ఓటర్‌ లిస్ట్‌ తయారు చేయాలనే చిత్తశుద్ధి లేదన్నారు.  ఇప్పటి వరకు 30 లక్షల ఓట్లను తొలగించిందని చెప్పారు. ఎన్నికల సంఘం అధికార పార్టీకి తొత్తుగా మారిందని  ఆరోపించారు. 
అధికార పార్టీకి ఎన్నికల సంఘం అనుకూలంగా పని చేసినందుకే సీఎం కేసీఆర్‌ ధన్యవాదాలు చెప్పారా అని అడిగారు. ఇటీవల  రాజకీయ పార్టీలను కలిసిన కేసీఆర్‌పై , ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేశారో ఆ పార్టీలకు లేఖలు రాస్తామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందనిఆయన ఆరోపించారు.

Related posts