telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండే ఏకైక పార్టీ టిఆర్ఎస్

ktr telangana

తెలంగాణ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండే ఏకైక పార్టీ టిఆర్ఎస్ అని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీజేపీ- కాంగ్రెస్ కి దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే—28వందల ఎజెండాలు ఉంటాయని..ఏ ఎన్నిక వచ్చినా టీఆరెస్ కి పరాజయం తప్పదు అన్నట్లు ప్రచారం చేసినా ప్రజలు కేసీఆర్ నాయకత్వానికి జై కొడుతున్నారని గుర్తుచేశారు.  బీజేపీ నేతలందరూ ఆర్భాట ప్రచారం తప్ప క్షేత్రస్థాయిలో ఫలితాలు శూన్యమని..గడిచిన ఆరేళ్లలో తెలంగాణకు టీఆరెస్ చేసింది ఏంటో అక్షర సంఖ్య లెక్కలు చెప్తామని పేర్కొన్నారు. 2 లక్షల 72వేల కోట్లు కేంద్రానికి తెలంగాణ ఇచ్చిందని..కేంద్రం నుంచి తెలంగాణ వచ్చింది 1లక్ష 29వేల కోట్లు మాత్రమేనన్నారు. తెలంగాణ టీఆరెస్ ఎమ్ చేసింది అంటే గంటసేపు ఉపన్యాసం ఇస్తాం..ఎన్డీఏ దేశానికి ఎమ్ చేసింది అంటే సప్పుడు చేయరని తెలిపారు.
జీడీపీ లో బంగ్లాదేశ్- శ్రీలంక కంటే వెనుకబడ్డామని..నల్లధనం తెచ్చి ఒక్కో అకౌంట్ లో 15లక్షలు వేస్తా అన్నారని ఎద్దేవా చేశారు. దేశానికి నల్లధనం తెలీదు కానీ నల్ల చట్టాలు తెచ్చారని..బీజేపీతో ఏ వర్గం లేదు అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. మతం పేరుతో చిచ్చుపెట్టాలని కొంతమంది కుట్ర చేస్తున్నారని..విద్వేషపు విత్తనాలకు తెలంగాణ లో స్థానం లేదన్నారు. కేవలం రాజకీయం కోసం తెలంగాణ పేరును నాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Related posts