టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న నేపథ్యంలో గంటా ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసుల మాఫీ కోసం గంటా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని అవంతి విమర్శించారు. గంటా దొడ్డిదారిన వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.
అధికారం ఎక్కడ ఉంటే గంటా శ్రీనివాసరావు అక్కడ ఉంటారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం లేకపోతే గంటా శ్రీనివాసరావు ఉండలేరని, సైకిళ్లు, భూ కుంభకోణాల్లో గంటాతో పాటు ఆయన అనుచరులు ఉన్నారని అవంతి ఆరోపించారు. గంటా శ్రీనివాసరావు కుంభకోణాలను విజయసాయిరెడ్డికి చెప్పానని అవంతి అన్నారు.