telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రజాస్వామ్యం ఓడింది.. ధనస్వామ్యం గెలిచింది: పొన్నం ప్రభాకర్

ponnam prabhakar fire on ktr

హుజూర్ నగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కావడంతో ఆ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ హుజూర్ నగర్ ఉపఎన్నికలో ఓటమితో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని, ధనస్వామ్యం గెలిచినట్టుగా భావిస్తున్నామని అన్నారు.

ఈ ఎన్నికలో తాము ఓడిపోయామని ఈ వ్యాఖ్యలు చేయడం లేదంటూ.. టీఆర్ఎస్ ఏ టూ జెడ్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ఈ విషయమై అనేక ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైనప్పటికీ, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తమ పార్టీయేనని పేర్కొన్నారు. తెలంగాణలో భవిష్యత్ లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Related posts