2001లో ‘”ఇష్టం” సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రియ శరణ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా హవా కొనసాగించింది. 18 ఏళ్లుగా సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణిస్తున్న ఈ బ్యూటీ 2018లో ఆండ్రీ కొశ్చెవ్ని రాజస్థాన్లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్ళి తర్వాత సినిమాలని పూర్తిగా తగ్గించేసింది. చివరిగా “గౌతమీపుత్ర శాతకర్ణి” చిత్రంతో పలకరించిన ఈ అమ్మడు ఇప్పుడు పలు తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం హిందీలో “తడ్కా” , తమిళంలో “నరగాసురన్”, “సండకారి” సినిమాలలో నటిస్తోంది. అయితే శ్రియ సోషల్ మీడియాను శ్రియా బాగానే ఉపయోగించుకుంటుంది. గ్లామర్ ఫొటోలను, వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ కుర్రకారును, అభిమానులను ఆకట్టుకుంటోంది. 36 ఏళ్ళ వయస్సులోను శ్రియ యూత్కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. అయితే తొలిసారి నటి శ్రియ తన భర్త ఆండ్రేని ముంబయిలో జరిగే వేడుకకు తీసుకొచ్చారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రమేష్ తౌరానీ ముంబయిలోని తన నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకు శ్రియ భర్తతో కలిసి వచ్చారు. అందమైన పేస్టెల్ లెహంగాలో ఆమె మెరిసిపోయారు. ఆండ్రే ఫార్మల్ ప్యాంట్, షర్ట్లో హ్యాండ్సమ్గా కనిపించారు. పార్టీకి వచ్చాక శ్రియ, ఆండ్రే కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అనంతరం లిఫ్ట్లో ఎక్కడానికి వెళుతూ ఆండ్రేకు లిప్ లాక్ ఇచ్చారు. అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు ఈ అవకాశం మళ్లీ రాదన్నట్లు చకచకా ఫొటోలు క్లిక్మనిపించారు. రష్యాకు చెందిన టెన్నిస్ ప్లేయర్, వ్యాపారవేత్త అయిన ఆండ్రే, శ్రియ చాలా కాలం పాటు డేటింగ్లో ఉన్నారు. 2018లో ముంబయిలోని లోఖండ్వాలాలో శ్రియ, ఆండ్రే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి నెల రోజుల ముందు శ్రియ ప్రేమలో ఉన్నారన్న విషయం బయటపడింది. 2018లో ఆండ్రేను పెళ్లి చేసుకుని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది.