ఏపీ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణ ఇంట విషాదం నెలకొంది. ఆయనకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి సుబ్బమ్మ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా సుబ్బమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నేళ్ల కిందట నారాయణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం ఆమెని బాగా కృంగదీసింది.
సుబ్బమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ సందర్భంగా నారాయణకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. పలువురు టీడీపీ నేతలు కూడా సంతాపాన్ని ప్రకటించారు. సుబ్బమ్మకు రేపు అంత్యక్రియలు జరగనున్నట్టు సమాచారం.