వైరస్ కట్టడి ఇక తమ చేతుల్లో లేదని కర్ణాటక సీఎం యడియూరప్ప అన్నారు. బెంగళూరు నగరంలో నేటితో సంపూర్ణ లాక్ డౌన్ ముగియనున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైరస్ కట్టడి ఇకపై ప్రజలదే బాధ్యతని అన్నారు. వారే కరోనా వ్యాపించకుండా చూసుకోవాలని చెప్పారు. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం రాత్రింభవళ్ళు పనిచేసిందని అన్నారు.
జూలై 14 నుంచి నగరంలో లాక్ డౌన్ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా కేసులు తగ్గలేదు. ఇప్పటివరకూ బెంగళూరులో 33 వేలకు పైగా కరోనా కేసులు వచ్చాయి. ఇక బెంగళూరులో లాక్ డౌన్ ఉండదని స్పష్టం చేశారు. కేవలం కంటెయిన్ మెంట్ జోన్లలో మాత్రమే నిబంధనలు అమలవుతాయన్నారు. ప్రతి ఒక్కరూ తమవంతుగా సహకరించాలని కోరారు. లాక్ డౌన్ ను మరో 15 రోజులు పొడిగించే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాతో పాటు పత్రికల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కాపుల అన్యాయాలపై పవన్ ప్రశ్నించలేదు: ఎమ్మెల్యే జక్కంపూడి