నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా గన్ మెన్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత 20 రోజులుగా ఆయన విధులకు హాజరుకాలేదు. తన గన్ మెన్ కు కరోనా అని తెలిసిన వెంటనే రోజా అప్రమత్తమయ్యారు.
నగరిలోని తన నివాసంలో రోజా హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. అయితే ఆమె ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రోజా స్పందించారు. తాను, తన కుటుంబ సభ్యులు అందరూ క్షేమంగానే ఉన్నామని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్న కేసీఆర్: భట్టి విక్రమార్క