telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పంటల మద్దతు ధరను ముందే ప్రకటించాలి: సీతక్క

seethakka mla

పంటల మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ముందే ప్రకటించాలని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యీ సీతక్క డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్‌కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సీతక్క మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను టీఆర్ఎస్ గుంజుకుంటుందని ఆరోపించారు. 50 సంవత్సరాల క్రితం మ్యాప్‌లతో అటవీశాఖ అధికారులు పోడు భూములలో ట్రెంచ్‌లు కొడుతున్నారని మండిపడ్డారు.

ఏ భూమిలో ఏ పంట పండుతుందో పండించే రైతుకు తెలుసు కానీ ప్రభుత్వానికి ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. . గిరిజనులైన ఎంపీ, మంత్రి పోడు భూములకు పట్టాలు ఇప్పించాలని ఎమ్మెల్యే సీతక్క పట్టుబట్టారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదు కానీ పేదలు నివాసాలు ఏర్పర్చుకున్న ఉన్న భూములను గుంజుకుంటుందని విమర్శించారు.

Related posts