telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ చెప్పేవన్నీ అబద్దాలు..చేసేవన్నీ తప్పుడు పనులే : చంద్రబాబు

chandrababu tdp ap

ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం నాయకులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఉన్న 30 జిల్లాలలో 5 ఏపిలోనే ఉండటం బాధాకరమన్నారు. కరోనాలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉండటం శోచనీయమని పేర్కొన్నారు. 6,500మంది ప్రాణాలు కోల్పోతే రైతులు, పేదలు, చేతివృత్తుల వారు ఆర్ధికంగా చితికిపోయారని..ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యతను వైకాపా విస్మరించిందన్నారు.
దోపిడి చేయడమే జగన్మోహన్ రెడ్డి ఏకైక మార్గమని.. రాష్ట్రాభివృద్దికి గండికొట్టే పార్టీని ఎప్పుడైనా చూశారా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజధాని 3ముక్కలు చేయడం రాష్ట్రానికి ఎంతో నష్టమని..
రివర్స్ పాలనతో రాష్ట్రాభివృద్దిని అంతా రివర్స్ చేశారని ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలు, చేసేవన్నీ తప్పుడు పనులని..ఇంతగా బరితెగించిన పార్టీని ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ అని బతిమాలితే అధికారం ఇస్తే పదేపదే తప్పుడు పనులు చేస్తూ చివరి ఛాన్స్ గా చేసుకున్నారన్నారు. ఏదిఏమైనా ఏపీలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని చంద్రబాబు అన్నారు. 

Related posts